అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్లో నటిస్తున్న ‘కుబేర’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి ఇప్పటికే ఓసారి యూ/ఏ సర్టిఫికెట్ జారీ అయిందని.. అయితే రన్టైమ్ విషయంలో కొంత అభ్యంతరం ఉందని తెలుస్తోంది.. ఈ సినిమాకు తొలుత లెంగ్తీ రన్టైమ్ను చిత్ర యూనిట్ సబ్మిట్ చేసింది. కానీ, సెన్సార్ వారు కొన్ని అభ్యంతరాలు చెప్పడంతో ఈ సినిమా రన్టైమ్ను ట్రిమ్ చేసి పంపారు.
దీంతో ఇప్పుడు ఈ చిత్ర రన్టైమ్ను 3 గంటలకు మేకర్స్ ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో కూడా ఏదైనా కట్స్ ఉంటాయా అనేది తెలియాల్సి ఉంది.