కుబేర ట్రైలర్ పై లేటెస్ట్ క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఎప్పుడంటే..?

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ చిత్రాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ యాక్టర్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

ఇక ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, జూన్ 13న ఈ ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉన్నా.. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్‌ను వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఈ ట్రైలర్ వస్తుందా లేదా.. అనే సందిగ్ధం నెలకొంది. కాగా, మేకర్స్ మాత్రం ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారు.

తాజాగా ‘కుబేర’ చిత్ర ట్రైలర్‌ను జూన్ 14న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు వారు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని మాత్రం వారు రివీల్ చేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను జూన్ 20న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version