యూఎస్ లో ముగ్గురుకీ హైయెస్ట్ గ్రాసర్ గా ‘కుబేర’

టాలీవుడ్ హిట్ దర్శకుడు శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ అండ్ టాలెంటెడ్ హీరో ధనుష్ కలయికలో చేసిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కుబేర”. ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం వాటిని రీచ్ అయ్యి భారీ హిట్ అయ్యింది. ఇక ధనుష్ కెరీర్లో వరుసగా మరో 100 కోట్ల గ్రాసర్ గా నిలిచిన ఈ చిత్రం ఇపుడు మరో రేర్ ఫీట్ ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో నటించిన ధనుష్, కింగ్ నాగార్జున కెరీర్లోనే కాకుండా తెరకెక్కించిన దర్శకుడు శేఖర్ కమ్ముల కెరీల్లో కూడా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఇది యూఎస్ మార్కెట్ లో జరగడం విశేషం. అక్కడ 2.1 మిలియన్ గ్రాస్ తో రికార్డ్స్ బ్రేక్ చేసింది. శేఖర్ కమ్ముల సినిమాలకి యూఎస్ మార్కెట్ లో మంచి ఫేమ్ ఉంది. అలానే తన సినిమాలు అద్భుతంగా రాణించాయి. ఇక లేటెస్ట్ గా కుబేరతో మళ్ళీ తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించడమే కాకుండా ధనుష్, నాగార్జున హైయెస్ట్ వసూళ్ళని కూడా దాటే రేంజ్ సినిమాని అందించారు.

Exit mobile version