కొరోనా పై కవితలు రాస్తున్న మహేష్ హీరోయిన్

కొరోనా పై కవితలు రాస్తున్న మహేష్ హీరోయిన్

Published on Mar 23, 2020 6:59 PM IST

బాలీవుడ్ భామ కృతి సనన్ కవితలు రాస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో సంభవిస్తున్న విపత్కర పరిస్థితులను ప్రతిబింబిస్తూ, మానవాళి ప్రకృతికి చేస్తున్న నష్టాన్ని ఎత్తి చూపుతూ ఆమె ఓ కవిత రాశారట. ప్రకృతి కోణంలో రాసిన ఆ పాటను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో దీనికి సంబంధించి వీడియో ఆమ్ పోస్ట్ చేశారు.

ఇక కృతి సనన్ బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకి వెళుతున్నారు. కృతి మహేష్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగులో నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కూడా కృతి సనన్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు