మహేష్ కి ఏం చెప్పాలో, తేల్చుకోలేకున్న కియారా.

మహేష్ కి ఏం చెప్పాలో, తేల్చుకోలేకున్న కియారా.

Published on Jun 11, 2020 10:59 AM IST

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ట్రాక్ లో దూసుకువెతుంది కియారా అద్వానీ. గత ఏడాది ఆమె నటించిన కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా సక్సెస్ తరువాత ఆమె అక్కడ బిజీ అయ్యారు. కాగా మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట మూవీ కోసం కియారా అద్వానీని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు. ఐతే ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ గా కియారా ఉన్నప్పటికీ డేట్స్ ఆడ్జస్ట్ చేయగలనా లేదా అనే ఆలోచనలో ఉన్నారట.

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోవడం వలన ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్ లో ముందుగా పాల్గొనాల్సిన పరిస్థితి నెలకొంది. మొదట అనుకున్న షెడ్యూల్ పూర్తిగా తారుమారైన నేపథ్యంలో మహేష్ మూవీకి కమిట్ అవ్వాలా లేదా అనే సందిగ్ధంలో ఆమె ఉన్నారట. దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ లోపు కియారా తన నిర్ణయం చెవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు