సూపర్ స్టార్ మహేష్ మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేశారు. ఆయన ఫైనల్ గా దర్శకుడు పరుశురామ్ స్క్రిప్ట్ కి కన్విన్స్ అయ్యాడు. త్వరలో ఈ మూవీని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహేష్ కోసం అప్పుడే హీరోయిన్ ని వెతికే పనిలో చిత్ర బృందం ఉన్నారట. కాగా దర్శకుడు పరశురాం ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలని అనుకున్నాడట. ఈ విషయంపై ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం.
ఐతే ఈ ప్రాజెక్ట్ ని కియారా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వలన ఈ మూవీ చేయలేను అన్నారట. అలాగే మరో రెండేళ్లు తన క్యాలండర్ ఖాళీ లేదని ఆమె అన్నట్లు సమాచారం. ప్రస్తుతం కియారా అక్షయ్ హీరోగా వస్తున్న లక్ష్మీ బాంబ్, ఇందూ కి జవానీ అనే చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలలో నటిస్తుంది. కాగా మరో హీరోయిన్స్ ని వెతికే పనిలో పరుశురాం ఉన్నారట. గతంలో భరత్ అనే నేను సినిమాలో కియారా మహేష్ కి జంటగా నటించింది.