టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘ఖలేజా’ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది. కానీ, ఆ తర్వాత ఈ సినిమాకు టీవీలో వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.
ఈ సినిమాను తాజాగా రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు బుక్ మై షో లో గంటకు ఏకంగా 14 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతుండటంతో ఈ సినిమాపై ఎలాంటి బజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
మరి ఈ సినిమాకు రీ-రిలీజ్కు ముందే ఇలాంటి హైప్ క్రియేట్ చేయడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.