మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రం షూట్ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే షూట్ కోసం కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. కాగా మేము విన్న తాజా విషయం ఏమిటంటే ఈ సినిమా బడ్జెట్ తగ్గించడానికి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారట. కరోనా వైరస్ కారణంగా రాబొయ్యే రోజులు ఎలా ఉంటాయో తెలియదు, థియేటర్స్ పై ఇంకా స్పష్టత లేదు, కాబట్టి అనవసరమైన ఓవర్ బడ్జెట్ లేకుండా చూసుకోమని మెగాస్టార్ సూచించారట. అలాగే, తక్కువ సిబ్బందితో ఈ చిత్రాన్ని చిత్రీకరించడానికి కఠినమైన చర్యలు తీసుకొనున్నారు.
మెగా సినిమా కావడంతో ఈ సినిమా పై రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఆచార్యలో చరణ్ పాత్ర ఉద్వేగ పూరితంగా ఉంటుందని, ఈ సినిమాకి చరణ్ పాత్ర హైలెట్గా నిలుస్తుందని.. దాదాపుగా చరణ్ పాత్ర అర గంట సేపు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. పైగా చెర్రి పాత్రకు హీరోయిన్ కూడా ఉంటుందట.
కాగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. ఇప్పటికే ఆ పాటను షూట్ చేశారు. పాట చాల బాగా వచ్చిందట. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.