మంచు విష్ణు హీరోగా ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కన్నప్ప”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ఊహించని విధంగా సాలిడ్ టాక్ తో స్టార్ట్ అయ్యింది. అయితే కన్నప్ప సినిమా నిన్న ఉదయంకే డీసెంట్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. కానీ టాక్ పడేసరికి మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షోలు బుకింగ్స్ మరింత లెవెల్లో పెరిగాయి.
దీనితో డే 1 మాత్రం కన్నప్ప ఒక సెన్సేషనల్ స్టార్ట్ ని అందుకుంది అని చెప్పొచ్చు. గత 24 గంటల్లో లక్ష 75 వేలకి పైగా టికెట్స్ ఈ చిత్రానికి బుక్ మై షోలో అమ్ముడుపోయాయి. దీనితో మంచు విష్ణు కెరీర్ లోనే ఒక ఊహించని నెంబర్ ఇపుడు రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి మేకర్స్ ఏ మేర వసూళ్లు అనౌన్స్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు నటించగా మోహన్ బాబు కూడా పవర్ఫుల్ పాత్ర పోషించడమే కాకుండా నిర్మాణం కూడా వహించారు.