‘కన్నప్ప’ను టార్గెట్ చేస్తే కఠిన చర్యలు.. మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ డివోషనల్ ఎపిక్ డ్రామా చిత్రం ‘కన్నప్ప’ జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాలో విష్ణు మంచు హీరోగా నటిస్తుండగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీంతో ఈ సినిమా ఎలాంటి ఘన విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘కన్నప్ప’ చిత్రాన్ని కావాలని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

తన సొంత ప్రొడక్షన్ హౌజ్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి ఓ అధికారిక నోట్ ఆయన రిలీజ్ చేశారు. ‘కన్నప్ప’ మన చరిత్ర అని.. ఇలాంటి సినిమాను ప్రతిఒక్కరు చూడాలని చిత్ర యూనిట్ కోరుతోంది. అంతేగాని, ఈ సినిమాపై కావాలని నెగెటివ్ ప్రచారం చేసినా, ఈ చిత్రాన్ని కావాలని టార్గెట్ చేసి నెగెటివిటీ స్ప్రెడ్ చేసినా వారిపై కఠన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో ‘కన్నప్ప’ మూవీకి నెగెటివ్ రివ్యూలను అవాయిడ్ చేయాలని మేకర్స్ ఈ విధంగా హెచ్చరిక జారీ చేశారు. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version