ఆ బహుమతి నాకు ఎంతో విలువైంది – కంగనా రనౌత్

ఆ బహుమతి నాకు ఎంతో విలువైంది – కంగనా రనౌత్

Published on Apr 6, 2025 7:00 AM IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు పంచుకుంటుంది. అయితే, ఆమె స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘ఎమర్జెన్సీ’ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ను పక్కనపెట్టి తమ చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయని కంగనా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తమ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఒక వ్యక్తి రాసిన లేఖను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది.

కాగా భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన ఈ సినిమా ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్న ఈ చిత్రంపై నిత్యానందం అనే వ్యక్తి ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ను ఎలాంటి బెరుకు లేకుండా రూపొందించిన కంగనను మెచ్చుకున్నాడు. ఆమెకు బహుమతిగా ఒక కాంచీవరం చీరను పంపినట్లు తెలిపాడు. అతడు రాసిన లేఖను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన కంగనా.. ఆ బహుమతి తనకు ఎంతో విలువైందని తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు