మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతి పెద్ద విజయం సాధించిన చిత్రాలలో జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి. అప్పటి జనరేషన్ ని ఒక ఊపు ఊపిన ఆ సినిమా టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం తుడిచి వేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఈ సోసియో ఫాంటసీ సినిమాని నిర్మాత అశ్వినీ దట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. భారీ క్యాస్టింగ్, అద్భుతమైన సెట్స్ తో ఖర్చు విషయంలో వెనుకాడకుండా ఈ సినిమాను ఉన్నత నిర్మాణ విలువతో తెరకెక్కించడం జరిగింది.
సామాన్యుడిని ప్రేమించే దేవకన్య పాత్రలో శ్రీదేవి అద్భుతంగా నటించగా ఆమె గ్లామర్ సినిమాకు మరో ఎత్తుగా నిలిచింది. ఇళయరాజా సంగీతం, వేటూరి పాటలు అన్నీ వెరసి ఓ అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. ఈ సినిమా విడుదలై రేపటికి 30ఏళ్ళు అవుతున్న సంధర్భంగా నిర్మాత అశ్వినీ దత్ దీనికి సీక్వెల్ ఉంటుందని తెలియజేశారు. ఈ సీక్వెల్ లో ఎవరు నటిస్తారు అనేది ఆయన తెలుపక పోయినా..రామ్ చరణ్ ఓన్లీ ఛాయిస్ అనేది అందరి తెలిసిన విషయం.
కాగా ఈ సోసియో ఫాంటసీ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తీయాలని అశ్వినీ దత్ ఆలోచనట. కాబట్టి కొంచెం లేటైనా చరణ్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నాడని వినికిడి. ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ నటించే పాన్ ఇండియా చిత్రం ఇదే కావచ్చు.