ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కర్ణాటకలో రేపు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సినిమా పై హైప్ను రేకెత్తిస్తూ.. సముద్రం ఒడ్డున ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ నిలబడి కథ పై చర్చించుకుంటూ కనిపించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోను కూడా విడుదల చేశారు. దీంతో, ఈ పిక్ క్షణాల్లో వైరల్ గా మారింది. అన్నట్టు మంగళూరులో నిర్మించిన గ్రాండ్ పోర్ట్ సెట్లో ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ జరగనుంది.
ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2026 వేసవిలో పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయాలని భావిస్తున్నారు.