జాన్వీ నటించిన క్రేజీ బయోపిక్ డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో .

జాన్వీ నటించిన క్రేజీ బయోపిక్ డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో .

Published on Jun 9, 2020 12:01 PM IST

2018లో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ధఢక్ మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్, తన రెండవ చిత్రమే ఓ ఛాలెంజింగ్ రోల్ ఎంచుకుంది. ఆమె కార్గిల్ యుద్ధంలో విమెన్ పైలట్ గా విరోచిత పాత్ర పోషించిన గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తుంది. గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ పోషిస్తుంది.

కాగా ఈ చిత్రం డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. థియేటర్స్ విడుదల లేకుండా వస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ మూవీ త్వరలో అందుబాటులోకి రానుంది. శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు