జాన్వీ కపూర్ మండిపాటు.. ఆమె మరణం విషయంలో

జాన్వీ కపూర్ మండిపాటు.. ఆమె మరణం విషయంలో

Published on Jun 30, 2025 8:01 AM IST

హిందీ సహా తెలుగు సినిమా దగ్గర కూడా మంచి ఫేమ్ ఉన్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో దేవర, ఇప్పుడు పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్ ఒకరు. మరి జాన్వీ కపూర్ తాజాగా ఓ విషాద ఘటన విషయంలో మండిపాటు వ్యక్తం చేసింది.

అయితే బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకాల మరణం తర్వాత ఆమెకి జరిగే అంతిమ కార్యక్రమాలు విషయంలో కొందరు మీడియా వ్యక్తులు కనబరిచిన అత్యుత్సాహానికి ప్రముఖ హీరో వరుణ్ ధావన్ తన ఇన్స్టా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసి కనీసం ఇలాంటి విషయాల్లో అయినా మీడియా వ్యక్తులు కవర్ చేసిన విధానం సరికాదని వరుణ్ చీవాట్లు పెట్టాడు.

అయితే తన స్టేట్మెంట్ కి జాన్వీ కపూర్ తన సమ్మతి తెలిపింది. చివరికి కనీసం ఒకరైన నోరు విప్పారు అంటూ ఈ సున్నిత అంశం పట్ల వరుణ్ స్టేట్మెంట్ తో నిలబడింది. దీనితో జాన్వీ కపూర్ స్టోరీ కూడా వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు