దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ ‘కుబేర’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్లో నటించారు. ఇక శేఖర్ కమ్ముల మార్క్ టేకింగ్తో పాటు ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.
ఈ సినిమా రిలీజ్ అయి రెండో వారంలోకి అడుగుపెట్టింది. రెండో ఆదివారం నాడు కూడా ఈ సినిమా తన సత్తా చాటుతూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ చిత్రానికి రెండో ఆదివారం నాడు బుక్ మై షోలో ఏకంగా 67 వేలకు పైగా టికెట్లు బుక్ కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టం అవుతుంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి ఫుల్ రన్లో ఎలాంటి వసూళ్లు వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.