పిక్ టాక్ : ‘పరమ్ సుందరి’ గెటప్స్‌లో సందడి చేసిన జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా

అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం నార్త్, సౌత్ అంటూ తేడా లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఆమెకున్న క్రేజ్‌ను ఫిల్మ్ మేకర్స్ క్యా్ష్ చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్‌లో ‘దేవర’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది.

అటు బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘పరమ్ సుందరి’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌ను ప్రస్తుతం శరవేగంగా నిర్వహిస్తున్నారు మేకర్స్. అయితే, ఈ సందర్భంగా ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మ్యాడాక్ ఆఫీస్ ముందు జాన్వీ, సిద్ధార్థ్ ఇద్దరు కూడా ‘పరమ్ సుందరి’ అవతారంలో మీడియా కంటికి చిక్కారు.

దీంతో మీడియా వారి ఫోటోలను క్లిక్ మనిపించారు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Exit mobile version