టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కాంబినేషన్లో వచ్చిన ‘జాట్’ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రావడంతో మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అయింది. ఇక గోపీచంద్ మార్క్ టేకింగ్తో ఈ సినిమాలోని మాస్ అంశాలు ప్రేక్షకులను మెప్పించాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా నేటి(జూన్ 5) నుంచి స్ట్రీమింగ్కు వచ్చింది. అయితే, ఈ సినిమాను థియేటర్లలో తెలుగు వెర్షన్లోనూ రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ థియేట్రికల్గా కేవలం హిందీలో వచ్చిన జాట్, ఇప్పుడు ఓటీటీలో మాత్రం హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
దీంతో ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.