ఐపీఎల్ 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ వద్దంటున్న కేఎల్ రాహుల్

రీసెంట్ గానే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్స్ లో మంచి ఉత్కంఠభరితంగా నడిచిన మ్యాచ్ లో భారత జట్టు అదిరే విజయాన్ని సొంతం చేసుకొని ఐసీసీ కప్ ని అందుకుంది. అయితే ఈ టోర్నమెంట్ లో ప్రముఖ క్రికెటర్ కే ఎల్ రాహుల్ కనబరిచిన ప్రతిభ ఎంతలా భారత జట్టుకి ప్లస్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే.

అయితే ఫైనల్ మ్యాచ్ లో కూడా కే ఎల్ రాహుల్ తన మార్క్ బాటింగ్ తో కప్ కైవసం చేసుకోడానికి ఎంతో దోహద పడ్డాడు. అయితే ఆ మధ్య కే ఎల్ రాహుల్ విషయంలో వచ్చిన అనేక విమర్శలుని అధిగమించి మళ్ళీ తాను ఫామ్ లోకి వచ్చి అందరికీ సమాధానం అందించాడు. మరి ఇదిలా ఉండగా ఇండియాలో మరో అతిపెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో తాను గతంలో లక్నో, పంజాబ్ జట్లకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.

కానీ ఇపుడు ఆ ఫ్రాంచైజ్ ల నుంచి బయటకి వచ్చిన తనని భారీ మొత్తంతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ జట్టుకి మాత్రం తాను నాయకత్వ భాద్యతలు తీసుకోవడం లేదని రిజెక్ట్ చేసాడట. దీనితో ఈ వార్త ఇపుడు క్రికెట్ లవర్స్ లో షాకింగ్ గా మారింది. తాను కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగాలని అనుకుంటున్నాడని అందుకే నాయకత్వ భాద్యతలు తీసుకోకూడదు అని భావిస్తున్నాడట. ఇక తన బదులు అక్షర్ పటేల్ ఈ భాద్యతలు తీసుకుంటాడని తెలుస్తుంది.

Exit mobile version