ప్రభాస్ రోల్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

ప్రభాస్ రోల్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Apr 14, 2020 9:00 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గాసిప్ ఏమిటంటే, ప్రభాస్ పాత్ర ఎండింగ్ ఈ చిత్రంలో వెరీ ఎమోషనల్ గా ఉంటుందట. అంటే క్లైమాక్స్ చాలా భావోద్వేగంతో సాగుతూ హృదయ విదారకంగా ఉంటుందని నేడు సోషల్ మీడియాలో కొత్త చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడని.. అందులో ఒక క్యారెక్టర్ క్లైమాక్స్ లో చనిపోతుందని కూడా వినిపిస్తోంది.

కాగా `జిల్` సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ చాల కొత్తగా కనిపించనున్నాడట. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నాలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ ఏడాది చివ‌ర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రానికి ‘జాన్’ అనే పేరుతో పాటు ‘ఓ డియర్, రాధేశ్యామ్’ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు