పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడని పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా సబ్జెక్టు కూడా పక్కా కమర్షియల్ అంశాలకు దూరంగా ఉంటుంది. మరి అలాంటి సినిమా పై భారీ అంచనాలు మరి ఎక్కువ అయితే.. చివరికీ పవన్ ఫ్యాన్సే నిరాశ పడే అవకాశం ఉంది. అజ్ఞాతవాసికి కూడా ఇలాగే జరిగింది. కాబట్టి వకీల్ సాబ్ కు భారీ అంచనాలు లేకపోవడమే మంచింది.
ఇక మొదట ఈ సినిమాని మే 15న ఆ తరువాత మళ్లీ జూన్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. పవన్ రీఎంట్రీ సినిమాని ఎప్పుడెప్పుడూ చేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం సినిమా వాయిదా అనేది బాగా నిరాశ పరిచేదే. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తిన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హరీష శంకర్ దర్శకత్వంలో కూడా ఇంకో కొత్త సినిమాకుచేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.