‘శర్వానంద్‌ – సిద్ధార్థ్‌’ మధ్య స్నేహం వైర్యం !

‘శర్వానంద్‌ – సిద్ధార్థ్‌’ మధ్య స్నేహం వైర్యం !

Published on Jun 23, 2020 3:00 AM IST

‘ఆర్ .ఎక్స్‌.100’తో విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా రాబోతున్న మల్టీస్టారర్ ‘మహాసముద్రం’. ఈ సినిమాలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రాణ స్నేహితులుగా కనిపించబోతున్నారట. అయితే వారి స్నేహమే ఓ అమ్మాయి వల్ల వైర్యంగా మారుతుందని.. దాంతో సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం నేర నేపథ్యంలో సినిమా నడుస్తోందని తెలుస్తోంది.

అదితిరావు హైదరీ కథానాయికగా నటించబోతున్న ఈ సినిమాకి అనిల్‌ సుంకర నిర్మాత. ఇక ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు