కరోనా మహమ్మారి కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని.. సినీ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడపటానికి ఈ ఖాళీ టైంను స్పెండ్ చేస్తున్నారు. తాజాగా మంచు విష్ణు తన ఫ్యామిలీ కోసం ఓ డిఫరెంట్ వంటకం చేసి,, దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ సందర్భంగా మెసేజ్ చేస్తూ.. ‘కొబ్బరికాయల లోపల కాల్చిన బియ్యం మరియు చికెన్ తో కొత్తగా వండటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ లాక్ డౌన్ ముగిసే సమయానికి, చాలా పేటెంట్లతో నేను చెఫ్ గా మారుతాను’ అంటూ మంచు విష్ణు సరదాగా పోస్ట్ చేశారు.
అన్నట్టు ఈ వీడియోలో మంచు మోహన్ బాబు తో పాటు మంచు లక్ష్మి కూడా ఉన్నారు. విష్ణు చేసిన ఫుడ్ కోసం వాళ్ళు ఆత్రుతగా వెయిట్ చేస్తూ ఉండటం, పుడ్ టేస్ట్ అదిరిపోయింది అన్నట్లు వాళ్ళు ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం బాగా ఆసక్తి రేపుతోంది. ఇక మంచు విష్ణు హీరోగా వస్తోన్న ‘మోసగాళ్లు’ జూన్ లో వచ్చే అవకాశం ఉంది.
కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.
https://www.instagram.com/tv/B_ABJg4AaVb/?igshid=w4sn82qzzr1f