తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం బయ్యర్లు ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్ర తెలుగు రైట్స్ కోసం భారీ మొత్తంలో చిత్ర నిర్మాతలకు ఆఫర్ చేస్తున్నారట. కూలీ తెలుగు రైట్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పోటీ పడుతున్నాయట. ఈ చిత్ర రైట్స్ను రూ.40-45 కోట్ల మధ్య ముగించేందుకు వారు ప్రయత్నిస్తున్నారట.
ఈ రెండు సంస్థలు కలిసి ఈ చిత్ర రైట్స్ను దక్కించుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ సినిమా రిలీజ్ గ్రాండ్గా ఉండబోతుందనేది వాస్తవం. ఇక కూలీ చిత్రంలో ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబెకా జాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు.