కరోనా వైరస్ మొత్తం ప్రపంచంలో ఒక రకమైన భయానిక వాతావరణాన్ని సృష్టించింది. ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా కరోనా పట్ల ప్రజలను మరింత అప్రమత్తం చేయడంతో పాటు సహాయ కార్యక్రమాలను కూడా ఇప్పటికే ముమ్మరంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో నితిన్
తన వంతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల రూపాయలను మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు.
ఇక కరోనా వైరస్ టాలీవుడ్ పరిశ్రమను టెంక్షన్లో పడేసింది. ఈ వైరస్ కారణంగా షూటింగ్ జరుపుకోవాల్సిన పలు సినిమాలు షెడ్యూల్స్ వాయిదా వేసుకున్నాయి. అయితే ఏప్రిల్ మొదటి తేదీ వరకూ షూటింగ్స్ వాయిదా వేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు అది ఇంకా పొగడించే అవకాశం కనిపిస్తోంది. బంద్ తో పాటు సామాజిక దూరంను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ లను పోస్ట్ ఫోన్ చేయాల్సిందిగా ప్రభుత్వాలు సినీ పరిశ్రమని కోరుతున్నాయి.