సుశాంత్ ఆత్మ హత్యతో మొదలైన బాలీవుడ్ వ్యతిరేక గళం ఎక్కడ వరకు వెళుతుందో అర్థం కావడం లేదు. ముఖ్యంగా సుశాంత్ మరణానికి కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ వంటి పెద్దలను బాధ్యులను చేస్తూ తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొన్ని చోట్ల సుశాంత్ మరణానికి సల్మాన్ మరియు కరణ్ జోహార్ కారణం అని పోలీస్ స్టేషన్స్ లో కేసులు ఫైల్ కావడం జరిగింది. ఇక అనేక మంది బాలీవుడ్ నటీనటులు ఇండస్ట్రీ పెద్దల వలన ఎదురైన చేదు అనుభవాలు, వారికి జరిగిన నష్టాలను వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు.
కాగా తాజాగా హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా కరణ్ జోహార్ వలన ఏర్పడిన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో ఆయుష్మాన్ అవకాశాల కోసం ధర్మ ప్రొడక్షన్స్ కంపెనీ ఆఫీస్ కి వెళితే ..మేము స్టార్ వారసులతోనే సినిమాలు తీస్తాం. నీలాంటి అనామకులతో కాదు అన్నట్లు అవమానకరంగా మాట్లాడారట. అవకాశాల కోసం తిరుగుతున్న ఆయుష్మాన్, అప్పుడు ఆ విషయాన్ని పట్టించు కోలేదు అన్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆయుష్మాన్ పెద్ద హీరోగా ఎదిగారు.