‘గేమ్ ఛేంజర్’ తమిళ ప్రొడ్యూసర్ భారీ సాయం

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది ఆదిత్యారామ్. ఆదిత్యారామ్‌ తర్వాత కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే కాకుండా పలు రకాలైన బిజినెస్‌లలోకి ఎంటరై తమిళనాడులో స్థిరపడ్డారు.

తమిళనాడులో ఆదిత్యారామ్‌ ప్యాలెస్‌ అంటే చాలా ఫేమస్‌. ఆయన ప్యాలెస్‌ నుండి ఎంతోమంది అవసరార్ధులకు వారికి కావాలసిన సాయాన్ని అందిస్తుంటారు. ఆదిత్యారామ్‌ అనగానే అమలాపురం అల్లునిగా ఒక తెలుగువాడుగా చెన్నైలో ఫుల్‌ ఫేమస్. ఈ ఏడాది సంక్రాంతి పండగకి ఆయన ఏకంగా 5000 మందికి పైగా వారి ఇంటి అవసరాలకు కావలసిన నిత్యావసరాలను అందించి భారీ సాయం అందజేశారు.

తాను చాలా చిన్న స్థాయి నుండి ఈ స్థాయి వరకు వచ్చానని.. అవసరాలు ఎలా ఉంటాయో అవి అవసరమైన వారికే తెలుస్తాయని.. తనకు ఎదుటివారు అవసరాలు తెలుసని.. అందుకే తనకు చేతనైన సాయం వీలైనంత మందికి చేస్తుంటానని.. ఈ పండక్కి దాదాపు 5000 మందికి పైగానే నిత్యావసరాలను అందించే చేసే అవకాశం దక్కిందని ఆదిత్యారామ్ ఈ సందర్భంగా తెలిపారు.

Exit mobile version