నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ షెడ్యూల్ లో బాలయ్య పై ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. పైగా ఈ యాక్షన్ కోసం ఫార్నర్స్ కూడా జాయిన్ కానున్నారు. అలాగే ఈ సీక్వెన్స్ లోనే బాలయ్య రెండో క్యారెక్టర్ కి సంబంధించి కూడా భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందట. మొత్తానికి ఈ వార్త మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది.
కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.