ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’

Published on May 16, 2025 8:00 AM IST

నందమూరి వారి టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో గత నెల మిడ్ లో రిలీజ్ కి రాగ ఇపుడు ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా నేటి నుంచి అందులో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు లు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు