NTR ఎఫెక్ట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కుమారస్వామి!

NTR ఎఫెక్ట్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కుమారస్వామి!

Published on Jun 11, 2025 9:19 PM IST

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైనప్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్-2’ని పాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక తమిళ దర్శకుడు నెల్సన్‌తోనూ తారక్ ఓ సినిమా చేయబోతున్నాడని టాక్.

అయితే, ఇప్పుడు ఒక్కసారిగా ఈ మూడు సినిమాలకంటే కూడా త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ త్వరలోనే ఓ మైథలాజికల్ కథను రూపొందించబోతున్నాడని.. ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్నాడని.. నిర్మాత నాగవంశీ ఓ క్లూ ఇచ్చాడు. ఈ సినిమా కుమారస్వామి కథను మనకు చూపించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక దీంతో అసలు ప్రజలకు తెలియను కుమారస్వామి కథను త్రివిక్రమ్ ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సాధారణంగా కుమారస్వామి చరిత్ర అనగానే వినాయకుడితో మూడు లోకాల ప్రదక్షిణలో పోటీ ఉండటం.. శివపార్వతుల చుట్టూ వినాయకుడు ప్రదక్షిణ చేసి గెలుపొందడం.. దీంతో కుమారస్వామి బాధతో భూలోకంలో కొలువుదీరాడు. ఇంత వరకే సామాన్య ప్రజలకు తెలిసిన కథ.

ఇప్పుడు కుమారస్వామికి సంబంధించి మరిన్ని కోణాలను మనకు చూపెట్టేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి నాగవంశీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కుమారస్వామి చరిత్ర ఏమిటా అని అభిమానులు వెతకడం మొదలుపెట్టారు. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు