‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ వచ్చేస్తోంది.. అప్డేట్‌కు డేట్ ఫిక్స్!

టాలీవుడ్‌లో దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ యూత్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. 2018లో వచ్చిన ఈ సినిమా యూత్‌ను బాగా అలరించడంతో పాటు సోషల్ మీడియా మీమ్స్‌కు కావాల్సినంత స్టఫ్ అందించింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటమ్, వెంకటేష్ కకుమాను లీడ్ రోల్స్‌లో నటించారు.

ఇక ఈ సెన్సేషనల్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ నగరానికి ఏమైంది గ్యాంగ్ మళ్లీ గ్యాదర్ అయ్యిందంటూ ఓ ప్రమోషనల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘టీమ్ కన్యా రాశి వస్తోంది’ అంటూ ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్‌ను జూన్ 28, 29న ఇవ్వబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాను తరుణ్ భాస్కర్ మరోసారి తనదైన స్టయిల్‌లో తెరకెక్కించబోతుండగా..సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. మరి ‘ఈ నగరానికి ఏమైంది 2’ నుంచి ఎలాంటి అప్డేట్స్ రానున్నాయో చూడాలి.

Exit mobile version