బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి రాబోతున్న స్పై యాక్షన్ చిత్రం ‘వార్ 2’కోసం యావత్ ఇండియన్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్కు రెడీ అయింది.
అయితే, ఈ సినిమాను తెలుగులో నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ‘వార్ 2’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించేందుకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు. ఆగస్టు 10న యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో సాయంత్రం 5 గంటలకు ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
దీంతో ఈ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ ఈవెంట్కు గెస్టుగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.