‘రామాయణ’లో స్పెషల్ విఎఫ్ఎక్స్ !

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ రామాయణ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో స్పెషల్ విఎఫ్ఎక్స్ కి పెద్ద పీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. సో విజువల్ ఎక్స్ పీరియన్స్ కూడా అదే లెవెల్లో ఉండబోతుందట. మొత్తానికి ఈ సినిమా ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. దర్శకుడు నితేష్ తివారీ రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల అవుతుందని తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగూ పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది కాబట్టి, అన్ని వర్గాల్లోనూ ఆసక్తి ఉంది.

Exit mobile version