స్టార్ హీరోయిన్ అపార్ట్మెంట్ లో కరోనా కేసు.

స్టార్ హీరోయిన్ అపార్ట్మెంట్ లో కరోనా కేసు.

Published on Jun 11, 2020 6:10 PM IST

లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నాటి నుండి దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోయింది. రోజుకు వేలల్లో దీనిబారిన పడుతున్నారు. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య లక్షలలోకి చేరుకుంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ముంబైలో మరింత ప్రమాదకరంగా మారింది.

కాగా బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఇంటిని సీజ్ చేయడం తోపాటు పరిసర ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా మార్చారు. మలైకా అరోరా నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లో ఒకరికి కరోనా సోకడంతో బిల్డింగ్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా మార్చినట్టు అధికారులు వెల్లడించారు. జూన్‌ 8న బిల్డింగ్‌ సీల్‌ చేసినట్టు తెలుస్తోంది. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఇంటి వద్దే ఉంటున్న మలైకా.. కుమారుడు అర్హాన్ తో కాలక్షేపం చేస్తోంది. ఈ క్రమంలో రోజూ ఓ గంట యోగా చేస్తానని మలైకా చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు