వారి మరణాలకు చలించిపోయిన చిరు.


లఢక్ లోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో ఇండియా మరియు చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బోర్డర్ వివాదంలో చైనా మరియు ఇండియా సైనికులు పరస్పరం దాడికి దిగడంతో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది సైనికులు ప్రాణాలు వదిలారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ వీర సైనికుల త్యాగాలను ప్రజలు కొనియాడుతున్నారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి .. ధైర్యవంతులైన 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందడం నా హృదయాన్ని కదిలించింది. తెలుగు కుర్రాడు కల్నల్ బిక్కుమల్లా సంతోష్ బాబు.. దేశం కోసం ప్రాణాలు అర్పించడం హక్కు అని ఆయన తల్లిదండ్రులు అనడం గర్వించదగ్గ విషయం. సైనికులకి నా సలాం. సైనికుల కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు .

దేశం కోసం జరిగిన యుద్ధంలో మన సైనికులు ప్రాణాలు కోల్పోవడం కంటతడి పెట్టించింది. అన్నారు.

Exit mobile version