‘ఎవడు’ కి డబ్బింగ్ చెబుతున్న రామ్ చరణ్

‘ఎవడు’ కి డబ్బింగ్ చెబుతున్న రామ్ చరణ్

Published on Jul 10, 2013 3:43 PM IST

Yevadu2

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ‘ఎవడు’. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమాకి డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి రామ్ చరణ్ ఎక్కువ సమయం డబ్బింగ్ థియేటర్ లోనే గడుపుతున్నాడు. ఈ సినిమాని జూలై చివరి వారంలో విడుదలకానుంది. జూలై 31న విడుదలయ్యే అవకాశం వుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని సమాచారం. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లబించింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు అతిధి పాత్రలో కనిపించనున్నారు.

తాజా వార్తలు