టాలీవుడ్లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB29 మూవీ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబుని ప్రపంచ స్థాయి హీరోగా మార్చాలని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్గా చిత్ర యూనిట్ తెరకెక్కించనుంది.
అయితే, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రియాంక భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గ్రాండియర్ మూవీ గా రాబోతున్న SSMB29 చిత్రంలో నటించేందుకు ప్రియాంక ఏకంగా రూ.20 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
యూనివర్సల్ స్థాయిలో ప్రియాంక చోప్రాకు ఉన్న క్రేజ్ కారణంగా ఆమెకు ఇంత మొత్తంలో భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో నటించనుందా.. అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి నిజంగానే ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా అంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందా.. అనేది తెలియాల్సి ఉంది.