రజనీని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్న కింగ్.. నిజమేనా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయగా ఆగస్టు 14న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, రజినీ తన నెక్స్ట్ చిత్రం ‘జైలర్ 2’ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాడు.

దర్శకుడు నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ మూవీకి సంబంధించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునను మేకర్స్ అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రజనీతో కలిసి ‘కూలీ’లో నాగ్ నటించాడు. దీంతో జైలర్ 2 కోసం ఆయనను విలన్ పాత్ర కోసం మేకర్స్ సంప్రదిస్తున్నారట.

అయితే, నాగ్ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదని తెలుస్తోంది. ఏదేమైనా నాగ్ తమిళ సూపర్ స్టార్ సినిమాలో విలన్‌గా నటిస్తాడనే వార్త తమిళ మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Exit mobile version