క్రేజీ రీమేక్లో బాలయ్య.. నిజమేనా ?

క్రేజీ రీమేక్లో బాలయ్య.. నిజమేనా ?

Published on Mar 23, 2020 4:14 PM IST

మలయాళంలో ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’. బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను శాచి డైరెక్ట్ చేయడం జరిగింది. ఈగో కలిగిన ఇద్దరు బలమైన వ్యక్తులు తలపడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే పనులు మొదలయ్యాయి.

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ రీమేక్లో నటించబోయే హీరోలు ఎవరనేది ఇంకా అధికారికంగా క్కన్ఫర్మ్ కాలేదు. దీంతో పలానా హీరో నటిస్తాడంటూ రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా బాలకృష్ణ పేరు చర్చకు వచ్చింది. నిర్మాత నాగ వంశీ బాలయ్యను సినిమాలోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నారట. మరి ఈ వార్తల్లో ఎంతమేర వాస్తవముందో తెలీదుకానీ ఒకవేళ నిజమైతే మాత్రం సినిమా తప్పక బాగుంటుంది. ఇకపోతే తమిళ రీమేక్లో ఈ సూర్య, కార్తీలు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు