పూరి హీరోయిన్ కి కూడా ఆ వేధింపులు తప్పలేదట

హీరో సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ లో ఓ ఉద్యమం లేవదీసింది. బాలీవుడ్ లో పాతుకుపోయిన నేపోటిజం, వేధింపులకు వ్యతిరేకంగా అనేక మంది తమ గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది తారలు బాలీవుడ్ లో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలు తెలియజేస్తున్నారు. కాగా హీరోయిన్ అయేషా టాకియా ఇన్‌స్టా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. కెరీర్‌ పరంగా తాను కూడా ఎన్నోసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నానని.. ఇబ్బందులకు గురిచేస్తోన్న వారి గురించి బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

అయేషా టకియా చాల సందర్భాలలో బెదిరింపులు ఎదుర్కొన్నారట. మనకు దక్కాల్సిన దాని గురించి పోరాటం చేయడానికే అందరం ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని గెలవనివ్వకండి అని కోరారు. ఇలాంటివి చేయడం కంటే చెప్పడం చాలా తేలికన్న అయేషా, మన భవిష్యత్తు తరాల బాగు కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించిన అయేషా టాకియా తెలుగు నాగార్జున పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ మూవీలో నటించింది.

Exit mobile version