టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పూరి మరోసారి తన ట్యాలెంట్ చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
అయితే, ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ను ఫిక్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ సినిమా కోసం మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాలని పూరి అండ్ టీమ్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాకు ‘భిక్షాందేహి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టాలని పూరి ఆలోచిస్తున్నాడట.
ఇక ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో టబు, దునియా విజయ్ తదితరులు నటించనున్నారు.