కమర్షియల్ డైరెక్టర్ గా అనిల్ రావిపూడికి ప్రస్తుతం ఫుల్ క్రేజీ ఉంది. పైగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మొత్తమ్మీద భారీ విజయాన్ని సాధించడం వెనుక అనిల్ రావిపూడి టాలెంటే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ – అనిల్ రావిపూడి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. తన సినిమాలను గోదావరి జిల్లాల అభిమానులు మరింత ఎక్కువగా ఆదరిస్తారని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
అనిల్ రావిపూడి ఇంకా మాట్లాడుతూ.. ‘గోదావరి అంటే మర్యాదకు మారు పేరు అని తెలిపారు. ఈ క్రమంలో డార్లింగ్ ప్రభాస్తో మీరు సినిమా ఎప్పుడు తీస్తారని ప్రభాస్ అభిమానులు ప్రశ్నించారు. వారి ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నేను కూడా అందుకే ఎదురు చూస్తున్నానని అనిల్ రావిపూడి బదులిచ్చారు. పైగా అభిమానులు గట్టిగా అనుకుంటే అయిపోతుందని అనిల్ రావిపూడి చెప్పడం విశేషం. ఇక తన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ను సక్సెస్ చేసిన ప్రతి అభిమానికి అనిల్ ధన్యవాదాలు చెప్పారు.