అనసూయ కొత్తగా ఎమోషన్ ఏం చూపిస్తోందో ?

అనసూయ కొత్తగా ఎమోషన్ ఏం చూపిస్తోందో ?

Published on Jun 7, 2020 10:50 PM IST

బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి మంచి డిమాండ్ సంపాదించింది యాంకర్ అనసూయ. ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమా తరువాత నుండి వరుస సినిమాలతో బిజీ అయిపొయింది ఈ బ్యూటీ. చాలా ఆఫర్లు వచ్చినా ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, తనకంటూ ప్రత్యేకత కథలో ప్రాధాన్యం కలిగి ఉన్న పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోంది. అలా ఒప్పుకున్న సినిమానే కృష్ణవంశీ ‘రంగమార్తాండ’.

కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట. నాటకాలు వేసే ఓ రంగస్థలం నటిగా నటించబోతుంది. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ఎమోషనల్ సీక్వెన్స్ లోనూ అనసూయ నటించాల్సి ఉంటుందట. మరి ఎప్పుడూ రొమాంటిక్ గానే కనిపించే అనసూయ ఇక కొత్తగా ఎమోషన్ ఏం చూపిస్తోందో..? ఇక ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.

ఈ చిత్రాన్ని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ‘కృష్ణ వంశీ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేక చతికిల పడుతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు