ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప, పుష్ప 2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ సాధించాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్లో ఆయన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక మనదేశంలో కూడా పుష్ప మేనియా ఏ రేంజ్లో ఉండేదో మనం చూశాం. అయితే, బాలీవుడ్లో పుష్ప క్రేజ్ ఇప్పటికీ ఉందని చెప్పాలి.
తాజాగా బాలీవుడ్లో తెరకెక్కిన ‘పరమ్ సుందరి’ అనే సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్ర, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో జాన్వీ కపూర్ ‘ఆంధ్ర – తెలుగు అల్లు అర్జున్’ అంటూ ఆమె పుష్ప చిత్రంలోని మేనరిజం చేసి చూపెట్టింది.
ఇది నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీంతో బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు సినీ స్టార్స్పై కూడా పుష్ప ఎలాంటి క్రేజ్ చూపెట్టాడో అర్థం చేసుకోవచ్చు.