అహ్మదాబాద్ విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. ఆలస్యంగా వెలుగులోకి

అహ్మదాబాద్ విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. ఆలస్యంగా వెలుగులోకి

Published on Jun 21, 2025 2:55 PM IST

గత కొన్ని రోజులు కితమే అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కోసం అందరికీ తెలిసిందే. అయితే విమానంలో ఉన్న ప్రయాణికులు సహా ఎందరో అమాయక జనం ఈ ప్రమాదంలో తమ ప్రమేయం లేకుండానే బలయ్యారు. అయితే ఇదే ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఓ ప్రముఖ గుజరాతీ దర్శకుడు మహేష్ జిరావాల కన్ను మూసిన మరో షాకింగ్ వార్త ఇప్పుడు మరింత విషాదాన్ని మిగిల్చింది.

గుజరాతీలో కాక్ టైల్ ప్రేమీ పగ్ ఆఫ్ రివెంజ్ అనే సినిమా తీసిన ఈ యువ దర్శకుడు అదే ప్రమాదంలో మరణించాడు అనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే విధి ఎంత విచిత్రం చేసిందంటే నిజానికి ఈ దర్శకుడు ఆ విమానంలో ప్రయాణం చేయలేదు. విమానం ఎక్కడైతే కూలిపోయిందో ఆ ప్రాంతంలో తనకి తెలిసినవారిని కలిసేందుకు వెళ్లి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారట. సరిగ్గా ఇదే ప్రమాదం జరిగిన రోజు నుంచే మహేష్ కనిపించకపోవడంతో కుటుంబీకులు కంగారు పడ్డారట.

అలా తాను ఆ ప్రమాద ఘటనాస్థలంలోనే ఉన్నాడని తెలుసుకోగా ముందు పోలీసులు అతని దేహమే అయ్యి ఉండొచ్చు అని ఒక దేహాన్ని కుటుంబీకుల కన్ఫర్మేషన్ కోసం చూపే ప్రయత్నం చేస్తే వారు ముందు వద్దన్నారు అది అతను కాదు అనుకున్నారు కానీ తీరా డీ ఎన్ ఏ పరీక్ష చేసిన పిదప అది మహేష్ అనే తేలిందట. దీనితో ఆలస్యంగా ఒక ఊహించని విషాద వార్త బయటకి వచ్చింది. అయితే మహేష్ కేవలం దర్శకునిగానే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్ ఇవ్వడంలో కూడా పాపులర్ అట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు