మస్కటీర్స్ మళ్ళీ కలిశారట..!

మస్కటీర్స్ మళ్ళీ కలిశారట..!

Published on Jun 7, 2020 9:13 PM IST

హీరో అడివి శేషు తన మిత్రులతో కలిసిన సందర్భాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. కమెడియన్ వెన్నెల కిషోర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ లతో కలిసిన సంధర్భాన్ని ఆయన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలుగా అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొన్ని రోజులుగా లాక్ డౌన్ పై సడలింపులు రావడంతో ఇలా పరిశ్రమలోని మిత్రులు, సన్నిహితులు ఒకరినొకరు కలవడం జరుగుతుంది.

ఇక వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రలను అడివి శేషు కలిసి దాదాపు ఆరు నెలలు అవుతుందట. చాలా కాలం తరువాత మిత్రులతో కలిసిన అడివి శేషు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అడివి శేషు మేజర్ అనే బయోపిక్ లో నటిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మించడం విశేషం. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా హిందీలో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి శశి కిరణ్ దర్శకుడిగా ఉన్నారు.

https://www.instagram.com/p/CBIL9wiJYpT/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు