మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ కోసం యాక్షన్ తో కూడుకున్న ఓ కామెడీ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట.
ఈ కామెడీ ఎపిసోడ్ వెంకీ – చిరు కాంబినేషన్ లో ఉంటుందని.. ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఈ ఎపిసోడ్ ను పెట్టాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


