ఓటిటి, శాటిలైట్ పార్ట్నర్స్ ని లాక్ చేసుకున్న ‘కుబేర’

ఓటిటి, శాటిలైట్ పార్ట్నర్స్ ని లాక్ చేసుకున్న ‘కుబేర’

Published on Jun 21, 2025 12:00 AM IST

కోలీవుడ్ వెర్సటైల్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కుబేర”. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం సాలిడ్ రిపోర్ట్స్ నమోదు చేస్తుంది. ఇక థియేటర్స్ లో ఎట్టకేలకి రిలీజ్ అయ్యిన ఈ సినిమా థియేటర్స్ రన్ అనంతరం ప్రసారం అయ్యే ఓటిటి శాటిలైట్ పార్ట్నర్స్ ని లాక్ చేసుకుంది.

ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక శాటిలైట్ విషయానికి వస్తే స్టార్ మా సంస్థ వారు ఈ సినిమాని సొంతం చేసుకున్నారు. సో థియేటర్స్ రన్ తర్వాత వీటిలో కుబేర అలరించనుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఎల్ ఎల్ పి వారు సహా అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు