టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘కన్నప్ప’ పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను కేరళలోని కొచ్చిలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నటుడు, నిర్మాత ఎం.మోహన్ బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘కన్నప్ప’ లాంటి సినిమా భాషతో సంబంధం లేకుండా ఆడాలని.. ఈ సినిమాకు మలయాళంలో కూడా మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. అంతేగాక, ఈ సినిమా మలయాళంలో వచ్చిన ‘తుడరుమ్’ కంటే ఒక్క రూపాయి అయినా ఎక్కువ కలెక్ట్ చేయాలని తాను కోరుతున్నట్లు మోహన్ బాబు అన్నారు.
కన్నప్ప చిత్రంలో మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. దీంతో మోహన్ లాల్ పాత్ర కోసం మలయాళ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉంటారని.. ఈ సినిమాలో ఆయన పాత్ర వారిని అలరించడం ఖాయమని మోహన్ బాబు అన్నారు. ఈ సినిమాను జూన్ 27న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.