టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB29 ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంలో మహేష్ సరికొత్త మేకోవర్తో ప్రేక్షకులను స్టన్ చేయనున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఈ సినిమాలో మరో వెర్సటైల్ హీరో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది.
విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే సుపరిచితుడు. ‘అపరిచితుడు’ సినిమాతో ఆయన టాలీవుడ్లో సాలిడ్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు SSMB29 లాంటి పాన్ వరల్డ్ మూవీతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను ఆయన పలకరించబోతున్నాడనే వార్త విక్రమ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. మరి నిజంగానే ఈ సినిమాతో విక్రమ్ మరోసారి టాలీవుడ్ జనాలను పలకరిస్తాడేమో చూడాలి.